భద్రాచలం, అక్టోబర్ 2: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తాతా, బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు దర్శించుకున్నారు.
సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. వారికి ఆలయ ఈవో ఎల్.రమాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి శేష వస్ర్తాలు అందజేశారు.