హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి కారును పార్కింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పార్క్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. అయితే కారును డ్రైవర్కు బదులుగా ఎమ్మెల్సీ గన్మెన్ భానుప్రకాశ్ నడిపారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా కారును నడిపినందుకుగాను గన్మెన్ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు.