యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఎమ్మెల్సీ వెంట ఎంపీపీ నారాయణరెడ్డి, నర్సింహారెడ్డి, చిన్నంరెడ్డి, గోవింద్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.