హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా మెదక్ జిల్లా రాస్పల్లి గ్రామంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నాయకులు, కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. సుభాష్రెడ్డి పిలుపుమేరకు మెదక్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు.