MLC By Elections | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మంగళవారం జరగాల్సిన ఈ ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జూన్ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్తోపాటు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.
గత నెల 28న జరిగిన ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని తాజా ఆదేశాల్లో సీఈసీ స్పష్టం చేసింది.