ధర్మసాగర్, మే 5: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి పదివేలు ఇప్పిస్తవా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నిలదీశా రు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించిందని, దీనికి తోడు కేంద్రం నుంచి రూ.10 వేలు ఇప్పించి సాయం చేయాలని సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో శుక్రవారం ఎమ్మెల్యే టీ రాజయ్యతో కలిసి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మక్కజన్న కొనుగోలు కేంద్రాన్ని పల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించిదని గుర్తు చేశా రు. పరిహారం విషయంలో అవగాహన లేకుండా బండి సంజయ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. తెలంగాణలో లేని రైతు ఆత్మహత్యల గురించి రేవంత్రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ఏ పంట ఎప్పుడు వేస్తరో రేవంత్కు తెలియనే తెలియదుగానీ, రైతుల గురించి, సీఎం కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులను కాపాడేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.