MLC Kavitha | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దుచేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని తెలిపారు. ఒకవేళ సీబీఐకి తన నుంచి ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు, సమాచారం కావాలనుకుంటే వ ర్చువల్ పద్ధతిలో హాజరవుతానని స్పష్టంచేశారు. తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీచేయడం సబబు కాదని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు పూర్తి విరుద్ధంగా తాజా నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. గతం లో (2022, డిసెంబర్)లో అప్పటి ఐవో (విచారణ అధికా రి) సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసిన విషయాన్ని గు ర్తుచేశారు.
ప్రస్తుతం 41ఏను ఏ పరిస్థితుల్లో జారీ చేశారో స్ప ష్టత లేదని పేర్కొన్నారు. అసలు సెక్షన్ 41ఏ కింద నోటీసు లు ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీచేయడంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయం లో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా, తనకున్న ప్రజాస్వామిక, రాజ్యాంగహక్కుకు భంగం కలిగించడంలో భాగంగానే సీబీఐ నోటీసు జారీ చేసిందని ఆరోపించారు. తనపై సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్రలేదని, పైగా కో ర్టులో కేసు పెండింగ్లో ఉన్నదని గుర్తుచేశారు. గతంలో ఈడీ తనకు నోటీసులు జారీ చేసిన సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించానని, ఈ కేసు పెండింగ్లో ఉన్నదని వివరించా రు.
తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని, ఇది సీబీఐకి కూడా వర్తిస్తుందని స్పష్టంచేశారు. గతంలో సీబీఐ బృందం హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు స హకరించిన విషయాన్ని ఉదహరించారు. 15 నెలల విరా మం తరువాత ఇప్పుడు సీబీఐ విచారణకు పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న ఆరు వారాలపా టు పార్టీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నదని, ఈ కారణాల రీత్యా ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని తెలిపారు. కావున తనకు ఇచ్చిన నోటీసులను నిలిపేయాలని కోరారు.
కోనసీమ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత
ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ కోనసీమ జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటించారు. పీ గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రాతిష్ఠాపన వేడుకల్లో పాల్గొనడంతోపాటు కడియం నర్సరీని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానికులు ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఈ నర్సరీ మొకల ప్రత్యేకతలు, వాటి పెంపకం తీరు తెన్నులను నర్సరీ రైతులు పుల్లా ఆంజనేయులు, వీరబాబు, రాజశేఖర్ ఈ సందర్భంగా కవితకు వివరించారు.