MLC Kavitha | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. శనివారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో గాయత్రి మందిరంలో ‘భారత జాగృతి ఆస్ట్రేలియా’ ఆధ్వర్యంలో, ఆదివారం న్యూజిలాండ్లోని అక్లాండ్ నగరంలో ఉన్న గణేశ్ టెంపులో తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. ఆయా వేడుకలకు ఎన్నారైలతో పాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. అదే రోజు న్యూజిలాండ్లో జరిగే ఎన్నారైల సమ్మేళనంలో కవిత పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ సమావేశానికి హాజరు కానున్నారు.
మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయాలని కవితకు వినతి
మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయాలని మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఆమె కలిసి వినతిపత్రం అందజేశారు. మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతుల్లేకుండా మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా గుర్తించడానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ భారతి హోళికేరిని కలిసి వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు.