హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తె లంగాణ): మహారాష్ట్రలోని సోలాపూర్కు ఎమ్మెల్సీ కవిత ఆదివారం వెళ్లనున్నారు. అక్కడి పుంజాల్ మైదాన్లో జరిగే బతుక మ్మ వేడుకల్లో ఆమె పాల్గొంటారు. నగరంలోని దత్తవాడ నుంచి అకల్కోట్ రోడ్లోని పుంజాల్ మైదాన్ వరకు సాయంత్రం జరిగే బతుకమ్మ శోభాయాత్రలో కూడా పాల్గొంటారు. ఎమ్మెల్సీ కవిత సోలాపూర్ బతుకమ్మ వేడుకలకు వస్తుండటం ఆనందంగా ఉన్నదని బీఆర్ఎస్ స్థానిక నేతలు నాగేశ్ వల్యాల్, దశరథ్ గోప్ తెలిపారు.