హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన ఎమ్మెల్సీ కవిత.. స్థానిక సంస్థలకు నిధులు, అభివృద్ధిపై చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల బలేపేతమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి నిధులు అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకే మంత్రితో చర్చించినట్లు కవిత తెలిపారు.