హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): బిలిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ఈ మేరకు సోమవారం కవిత ఎక్స్ లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తున్నదని ఆమె తెలిపారు.
ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు. కాగా, బిలిస్ బానో దోషులను ముందస్తుగా విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గత ఏడాది మేలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే.