హైదరాబాద్ : మదాపూర్ ఆర్ట్గ్యాలరీలో ఏలె లక్ష్మణ్ ఆధ్వర్యంలో బతుకమ్మల పూల నేపథ్యంలో నిర్వహించిన ‘పూలమ్మ’ ఫొటో ఎగ్జిబిషన్ను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన కళా రూపాలను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ సందర్భంగా పూలమ్మ పేరుతో ఆర్ట్ గ్యాలరీని సంతోషంగా ఉందన్నారు. పూల కాన్సెప్ట్తో తెలంగాణలోని ఆర్ట్ను, కల్చర్, జీవన శైలిని చూపేలా ఉన్న ఎగ్జిబిషన్తో మనసు పులకించిపోయేలా ఉందన్నారు. లలిత కళా అకాడమీని ప్రారంభించాలనే కళాకారుల వినతిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కవిత హామీ ఇచ్చారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక గీతాలను హైదరాబాద్లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కొదారి శ్రీనివాస్ పర్యవేక్షణలో ‘బతుకమ్మ పాటలు-2022- తెలంగాణ పూల పండుగ’ పేరుతో రూపొందించిన ఏడు బతుకమ్మ పాటలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి, మహిళా విభాగం కన్వీనర్ చెన్నమనేని ప్రభావతి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, జాగృతి నాయకులు విక్రాంత్ రెడ్డి, కుమారస్వామి, బల్మూరి సుమన్, తిరుపతి వర్మ, భిక్షపతి, అనంతుల ప్రశాంత్, అర్చన, చరణ్, ఉపేందర్, కాంచనపల్లి తదితరులు పాల్గొన్నారు.