పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాలో జూలై 15న జరిగే బోనాల పండుగ పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్లో ఆవిషరించారు. ఈ సందర్భంగా కవిత బ్రిస్బేన్లోని తెలంగాణవారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత జాగృతి ఆధ్వర్యంలో జూలై 15న ఉదయం 10 గంటలకు బ్రిస్బేన్లోని గాయత్రి మందిర్లో బోనాల వేడుక ప్రారంభమవుతుందని నిర్వాహకులు శ్రీకర్రెడ్డి అండెం, కోరబోయిన విజయ్ తెలిపారు. కార్యక్రమానికి బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్, క్వీన్స్ ల్యాండ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గోల్డ్కోస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా మద్దతు పలికినట్టు చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, యువజన విభాగం అధ్యక్షుడు కోరబోయిన విజయ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ, రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.