హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అధికారం ఉన్నా లేకున్నా తాము తెలంగాణ సేవకులమన్నది మరిచిపోవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కష్టపడి పనిచేసిందుకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, సోషల్ మీడియా వారియర్స్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని ఆమె ట్వీట్ చేశారు. కోరుట్ల నియోజకవర్గం (ఇక్కడ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్పై బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ గెలుపొందారు) ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.