న్యూఢిల్లీ: రైతులు పండించిన పంటకు సరైన ధర లభించడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)అన్నారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ దీక్ష కొనసాగుతున్నది. ఇందులో మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకే విధంగా ధాన్యం సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతు నేత రాకేష్ టికయిత్ తమకు మద్దతు ఇవ్వడానికి దీక్షలో పాల్గొన్నారని చెప్పారు. ఇప్పటికే ఆయన వ్యవసాయ సమస్యలపై సీఎం కేసీఆర్తో మాట్లాడారన్నారు.