నిజామాబాద్: ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక్కటే ఇందుకు నిదర్శనం అని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కుటుంబీకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో టిఆర్ఎస్ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్ని రోజులు అవాకులు చవాకులు చేసిన బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారన్నారు. నల్లగొండలో హ్యాట్రిక్ సాధించామని, ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉంటారనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు. కాగా, ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని వెల్లడించారు. ఎంతో మహిమగల నీలకంటేశ్వరున్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.