హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దారిదీపమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత పురోగతి సాధించిందని తెలిపారు. కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం దేశంలో ఎకడా లేనన్ని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
మహారాష్ట్రలో చేనేత కార్మికులు పడుతున్న బాధలు, కష్టాలు తీరాలంటే తెలంగాణ అభివృద్ధి నమూనానే ఏకైక పరిషారమని చెప్పారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఇటీవల మహారాష్ట్రలోని సోలాపూర్కు వెళ్లిన కవిత అకడి వస్త్ర పరిశ్రమలను సందర్శించారు. వాటి నిర్వాహకులతో, కార్మికులతో మాట్లాడారు.
ఆ సంభాషణ వీడియోను శనివారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. మహారాష్ట్రలో వస్త్ర పరిశ్రమలతోపాటు ఇతర పరిశ్రమలకు నీటి కొరత, విద్యుత్తు కొరత తీవ్రంగా ఉన్నదని, విద్యుత్తు చార్జీలు కూడా చాలా ఎకువగా ఉన్నాయని కార్మికులు కవిత దృష్టికి తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం వస్త్ర, చేనేత పరిశ్రమదారులు, కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వారు ప్రశంసించారు.
చేనేత పరిశ్రమకు అనేక రాయితీలు
తెలంగాణలో పవర్లూమ్ పరిశ్రమలకు సీఎం కేసీఆర్, టెక్స్టైల్శాఖ మంత్రి కేటీఆర్ అనేక రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలకు నీటి కొరత, విద్యుత్తు కొరత లేకుండా సీఎం కేసీఆర్ దూరదృష్టితో అనేక సంసరణలు చేపట్టారని వివరించారు. ఈ చర్యల వల్ల పరిశ్రమలు నడుపుతున్న వారికే కాకుండా కార్మికులు, ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని చెప్పారు. బతుకమ్మ చీరలను రాజకీయం చేసిన కాంగ్రెస్కు మహిళలు కర్రుకాల్చి వాతపెడుతారని తేల్చి చెప్పారు.