హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆగస్టు 15 నుంచి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించడం లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 45 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయని, ఇంత భారీ ఎత్తున పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 4 లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు.