MLC Kavitha | హైదరాబాద్ : భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఉదయం సందర్శించిన సంగతి తెలిసిందే. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కవిత ఆరా తీశారు. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కవిత మండిపడ్డారు. కవిత హాస్టల్ను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం కమిటీ వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ఈ సందర్భంగా కవిత ట్వీట్ చేశారు. ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తమ డిమాండ్కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు అని కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి…. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు.
నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను… pic.twitter.com/eGOl6Y7va4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024