హైదరాబాద్ : బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. తనపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తున్న కోమటిరెడ్డికి ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. నిత్యం ఆరోపణలు చేసే రాజగోపాల్ రెడ్డికి ఆమె కడిగి పారేశారు.
రాజగోపాల్ అన్న.. తొందరపడకు.. మాట జారకు అని కవిత సూచించారు. 28 సార్లు కాదు, 28 వేల సార్లు నా పేరు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు అని కవిత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
రాజగోపాల్ అన్న ..
తొందరపడకు , మాట జారకు !!
” 28 సార్లు ” నా పేరు చెప్పించినా
” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా
అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail https://t.co/476lW6fOTC— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022