హైదరాబాద్ : ఇందూరులో అక్రమ మైనింగ్ కథనాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం స్పందించారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్రమ మైనింగ్పై వస్తున్న ఫిర్యాదులు, కథనాలపై ఆయనతో చర్చించారు. ఈ విషయంలో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.