ఊహించినట్టే మరో కుట్ర. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణను ‘కేసుల ముసుగు’లో దెబ్బకొట్టే ఎత్తుగడ. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం తట్టుకోలేక, 8 ఏండ్లుగా దేశానికి ఏం చేశారన్న సూటి ప్రశ్నకు జవాబు చెప్పలేక, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రతిద్వంద్విగా మారడాన్ని సహించలేక, ప్రభుత్వాల కూల్చివేత బండారాన్ని బట్టబయలు చేయడం ఓర్చుకోలేక… భారత రాష్ట్ర సమితి నేతలపై… ‘మోదీ- బీజేపీ’ కక్షసాధింపు రాజకీయాలకు దిగింది.
‘తెలంగాణలాగే దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నా’ అని ప్రకటించిన కేసీఆర్ను నేరుగా, రాజకీయంగా ఎదుర్కొనలేక, ఆయన కూతురు, తెలంగాణ ఉద్యమకారిణి, భారత జాగృతి సారథి కవితను టార్గెట్ చేసింది. విపక్ష నేతలను కట్టడి చేయడానికి, వారి కుటుంబ సభ్యులపైకి దర్యాప్తు సంస్థలను ఎగదోయడం అనే విధానాన్ని ఇప్పటికే పలు రాష్ర్టాల్లో అమలు చేస్తున్న బీజేపీ, ఇప్పుడు దాన్నే తెలంగాణలోనూ ప్రయోగించింది.
అక్రమాల ‘దోస్తులు’ అడ్డంగా దొరికినా కనీసం కేసైనా పెట్టని బీజేపీ ప్రభుత్వం, పలు కుంభకోణాల్లో నిందితులైనా తమ పార్టీలో చేరగానే కేసులను చాప కింద దాస్తున్న బీజేపీ ప్రభుత్వం, కాల్డేటా సాక్షిగా అక్రమాలు బయటపడ్డా, కనీసం విచారణకు రాని తనవాళ్లపై ఎలాంటి దర్యాప్తులూ జరపని బీజేపీ ప్రభుత్వం, కోట్ల రూపాయల డబ్బుతో రెడ్హ్యాండెడ్గా దొరికినా తన పార్టీ ఎమ్మెల్యేలకు చెర విడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. బీఆర్ఎస్ను బద్నాం చేయడానికి, తానే కర్త కర్మ క్రియగా సృష్టించిన సోకాల్డ్ లిక్కర్స్కాంను వాడుతున్నది.
ఎవరు ఎప్పుడు అరెస్టవుతారో నిన్నమొన్నటి దాకా తేదీలతో సహా చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు, ఇప్పుడు ‘కేసులు- దర్యాప్తు సంస్థలతో మాకేం సంబంధం?’ అంటూ తాజాగా భుజాలు తడుముకోవడమే తెరవెనక నాటకానికి అసలు ఆధారం. ‘ఇది వ్యక్తిగత వ్యవహారం. తెలంగాణకేం సంబంధం?’ అని వారు చేస్తున్న వాదనే… 22 ఏండ్లుగా తెలంగాణతో మమేకమై పనిచేస్తున్న బీఆర్ఎస్ను, దాని నాయకత్వాన్ని తెలంగాణ నుంచి వేరుచేసి చూపే యత్నానికి నిదర్శనం. బీఆర్ఎస్ను, దాని నాయకత్వాన్ని ఏదో ఒక రకంగా దెబ్బకొడితే తప్ప తెలంగాణను చేజిక్కించుకోలేమనే రాజకీయ వ్యూహంలో లిక్కర్ స్కాం కేసులు, నోటీసులు సరికొత్త అంకం.
తెలంగాణ ఉద్యమకారిణిగా, లోక్సభ సభ్యురాలిగా పనిచేసి, ఎమ్మెల్సీగా ఉన్న ఒక మహిళకు మహిళా దినోత్సవం రోజు ఈడీ నోటీసులు పంపడం, హద్దులు దాటిన కక్షసాధింపు, వేధింపు రాజకీయాలకు పరాకాష్ఠ!
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కుతంత్రాలకు తెలంగాణ తలవంచదని భారత జాగృతి సారథి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. మార్చి 9న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ తనకు నోటీసులు జారీ చేసిందని ఆమె తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆమె ప్రకటించారు. ఈమేరకు కవిత బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకల కేసులో ఈనెల 9 (గురువారం రోజు)న దర్యాప్తునకు హాజరు కావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం కవితకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కవిత స్పందించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత జాగృతి ఈనెల 10 (శుక్రవారం రోజు)న ఢిల్లీలో ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టిందని ఆమె గుర్తు చేశారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది తమ డిమాండ్ అని ఆమె తెలిపారు. ధర్నాకు ఒక రోజు ముందు 9న దర్యాప్తునకు రావాలం టూ తనకు నోటీసులు వచ్చాయన్నారు. ముందస్తుగా ఖరారై ఉన్న కార్యక్రమాలు, అపాయింట్మెంట్ల దృష్ట్యా దర్యాప్తునకు హా జరయ్యేందుకు కొంత సమయం కావాలని ఈడీని కోరనున్నట్టు ఆమె చెప్పారు.
విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానన్నారు. ఈడీ నోటీసులు, విచారణలతో బీఆర్ఎస్ను లొంగదీసుకోవడం సా ధ్యం కాదని కవిత స్పష్టంచేశారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడకుండా బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను ఆపలేరని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను తాము కేసీఆర్ నాయకత్వంలో ఎం డగడుతూనే ఉంటామన్నారు. కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ తలవంచబోదన్న విషయాన్ని మరోమారు గుర్తుచేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా మరింత సమ యం కావాలన్న కవిత అభ్యర్థనపై ఈడీ స్పం దించాల్సి ఉంది. మరోవైపు జంతర్మంతర్ దీక్షకు ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం కవిత బుధవారమే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
11న విచారణకు హాజరవుతా.. ఈడీకి కవిత లేఖ
ఈడీ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో ఈ నెల 11న తాను విచారణకు హాజరు కాగలనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవా రం ఈడీ జాయింట్ డైరెక్టర్కు ఆమె లేఖ రాశారు. ముందే నిర్దేశించుకున్న కార్యక్రమాలు, ముందస్తు అపాయింట్మెంట్లు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేనని తేల్చిచెప్పారు. నోటీసుల తీరుపైనా కవి త అభ్యంతరం వ్యక్తంచేశారు. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడీ కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ‘8న నోటీసులు ఇచ్చి.. 9న విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఇం త స్వల్పవ్యవధిలో విచారణకు రావాలని హడావుడిగా నోటీసులు జారీ చేయడం ఏమిటి? అంత అత్యవసరమేమిటో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు. ఒక మహిళగా, దేశ పౌరురాలిగా చట్టపరమైన అన్ని హక్కులనూ ఉపయోగించుకుంటానని స్పష్టంచేశారు.
రోజులు దగ్గరపడ్డాయి: బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బలపకుండా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు కేంద్రం ఈడీతో నోటీసులు జారీ చేయించిందని ఆ పార్టీ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కటమే పనిగా మోదీ సర్కార్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈడీ, సీబీఐ సంస్థలను ఇష్టారీతిగా దుర్వినియోగం చేస్తున్న బీజేపీకి పాపం పండే రోజు వస్తుందని అన్నారు. అదానీ వ్యవహారాన్ని తేల్చాలని పార్లమెంట్లో తాము నిగ్గదీసినా పట్టించుకోని కేంద్రం.. విపక్ష నేతలను టార్గెట్ చేయటం శోచనీయమని పేర్కొన్నారు.
విపక్షాలే టార్గెట్..ఇది ఓపెన్ సీక్రెట్: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
సీఎం కేసీఆర్ కు టుంబాన్ని బ్లాక్ మె యిల్ చేయాలని మోదీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని రాజ్యసభ స భ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో కవితకు నోటీసులు ఇచ్చినంత మాత్రన బీఆర్ఎస్ బెదిరిపోదని స్పష్టం చేశారు. 2014 నుంచి సీబీఐ దాడులు ఎదురొన్న 124 మంది నాయకుల్లో 118 మంది విపక్ష నేతలేనని అన్నారు. ప్రజాధనాన్ని కేంద్రం కార్పొరేట్లకు కట్టబెడుతుంటే దర్యాప్తు సంస్థలు ఏమిచేస్తున్నాయని ప్రశ్నించారు. విపక్షాలే మోదీ టార్గెట్..ఇది ఓపెన్ సీక్రెట్ అని విమర్శించారు.
జాతి ‘జాగృత’మైతున్నది: అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడంలో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. భారత జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలను చైత్యవంతులను చేసిన కవిత ఇప్పుడు దేశ ప్రజలను జాగృతి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే అడ్డుకోవడానికి కేంద్రం ఈడీ ద్వారా నోటీస్ ఇప్పించిందని ఆరోపించారు. ఈ నోటీసులకు భయపడేది లేదన్నారు. కేంద్రం వేధింపులను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పారు.
మహిళలంటే గిట్టకనే కవితకు నోటీసులు: రెడ్ కో చైర్మన్ వై సతీశ్రెడ్డి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఎమ్మెల్సీ కవితకు రాజకీయ దురుద్దేశంతో ఈడీ నోటీసులు ఇచ్చిందని రెడ్ కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. మహిళల హకుల కోసం పోరాడుతున్న నాయకురాలిపై ఈడీ నోటీసులు ఇవ్వడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. బీజేపీ అక్రమాలను, అరాచకాలను ప్రశ్నించిన వారిని ఈడీ, సీబీఐ, ఐటీతో అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు.
ప్రశ్నిస్తే వేధింపులా: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
కేంద్ర ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుటుంబంపై కేంద్రం కక్ష సా ధింపు చర్యలకు పాల్పడుతున్నదని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆరోపించారు. ఇందులో భాగంగానే కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మ ద్యం కుంభకోణంలో ఇరికించేందుకే ఈడీ తో నోటీసులు జారీ చేయించిందని విమర్శించారు. ఇటీవల ఇదే కుంభకోణంపై సీబీ ఐ అధికారులు జరిపిన విచారణలో కవిత అన్ని విషయాలు వెల్లడించిన తర్వాత కూ డా నోటీసులు ఇప్పించడం దారుణమని మండిపడ్డారు. రాజకీయ ప్రతీకారంతో కేం ద్రం ఇంత దారుణంగా వేధించడం దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
ఇదేమి రాజ్యం?: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, వీహెచ్
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దనే రీతిలో పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను మోదీలాగా ఎవరూ దుర్వినియోగం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దాడులకు గురైన సుజనాచౌదరీ, సీఎం రమేశ్ లాంటి వాళ్లు బీజేపీలో చేరగానే పవిత్రులైపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ దుర్మార్గ విధానాన్ని ప్రజలకు చెప్తున్నామని తెలిపారు.