హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అధికారభాషా సంఘం మొదటి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు (84) భౌతికకాయానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్రావు హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఈ క్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా వేణుగోపాల్తో కలిసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. ప్రభాకర్రావు 2016, ఏప్రిల్ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం చైర్మన్గా కొనసాగుతున్నారు.