తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు.
ఆమె జీవితం తెలంగాణ బిడ్డలెందరికో స్ఫూర్తి అని పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం గారి మృతి అత్యంత బాధాకరం.. వారి జీవితం తెలంగాణ బిడ్డలెందరికో స్ఫూర్తి..
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. pic.twitter.com/sW7NTb2tCu— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 19, 2022