హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ‘ఆడబిడ్డనైన నన్ను నిజామా బాద్ ఎంపీ అర్వింద్ అనే మాటలు మీ ఆడపిల్లలను అంటే మీకు సమ్మతమేనా? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, సీఎం కేసీఆర్ బిడ్డను కాబట్టి నన్ను ఏది అన్నా ఒప్పుకొందామా? తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా?’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు. నిజామాబాద్లో తాను ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో గెలిచిన వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా హూందాగా, మౌనంగా ఉంటూ కార్యక్రమా లు చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పారు. తనపై ఎంపీగా గెలిచిన వ్యక్తి బాధ్యతను విస్మరించి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా అనేకసార్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న తాను ప్రజలకోసం ఏవైనా పనులు చేయకపోయినా, ప్రశ్నిం చినా సరే వాటికి సరైన రీతిలో సమాధానాలు చెప్పే ధైర్యం, శక్తి తనకు ఉన్నదని చెప్పారు. అలాంటిది ‘నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా.. మీ అన్న సచ్చిపోతే పది లక్షలు ఇస్తా.. మీ నాన్నా ఇట్లా అంటూ.. అది, ఇది అని అర్వింద్ మాట్లాడటం, ఇ లాంటి భాషను ప్రయోగించడమే కాకుండా వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి’ అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణ ఉద్య మం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రా పాలకులపై మనం ఇలాంటి అమర్యాదకరమైన మాటలు మాట్లాడలేదని, అప్పుడు కూడా అంశాలవారీగానే వారిని ప్రశ్నించాం’ అని ఆమె గుర్తుచేశారు. అలాంటి మర్యాదకరమైన రాజకీయా లనే ఇప్పుడు కూడా తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అసభ్యకరంగా వ్యవహరించే రాజకీయాలను ప్రోత్సహించవద్దని తెలంగాణ ప్రజలను కోరారు.