హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని చెప్పారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు.
గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ భాష ఎలా ఉంది.. ఆయనపై కేసులు పెట్టాలన్నారు. మహిళల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ను బొంద పెట్టాలని రెండు జాతీయ పార్టీలూ చూస్తున్నాయని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకపోతే ప్రజలకే నష్టమన్నారు.