MLC Kavitha | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్న హస్తం పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా మారిన కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు.
అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు అంటూ కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు. బెంగళూరు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని పేర్కొంటూ డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోను కవిత షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం అని ధ్వజమెత్తారు. ఢిల్లీ, గల్లీలలో మోకరిల్లడం కాంగ్రెస్ పార్టీ నైజం అంటూ ఆమె నిప్పులు చెరిగారు.
అప్పుడు ఢిల్లీ
ఇప్పుడు ఢిల్లీ… కానీ ఇప్పుడు వయా బెంగళూరుకాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం…
ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం… pic.twitter.com/dRJN89lamJ— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 2, 2023