హైదరాబాద్ : విఘ్నాలూ తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కవిత, అనిల్ దంపతులు హైదరాబాద్లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ కవిత వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.