జగిత్యాల : నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో బీజీ బిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత సామాన్య మహిళతో కలిసి సేదతీరారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాసేపు ఆగారు. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు.
మొక్క జొన్న కంకులు అమ్మే కొమురమ్మతో మాట కలిపారు. సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నాటి సమైక్య పాలనకు.. నేటి కేసీఆర్ సారు పాలనకు గల తేడాను ఆమె వివరించింది. తనకే కాదు ఇంటింటికి పింఛన్, పలు సంక్షేమ పథకాలు కేసీఆర్ సార్ మంచిగిస్తుండని కొమురమ్మ సంబురంగా తెలిపింది.
స్వయంగా సీఎం కేసీఆర్ కూతురే తన వద్ద మొక్కజొన్న కంకి కొనుగోలు చేసి తింటూ మాట్లాడటంపై కొమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఎమ్మెల్సీ కవితను చూసిన స్థానిక వాహనదారులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకోగా.. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరించారు ఎమ్మెల్సీ కవిత.