హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వెనకి తగ్గి కాలయాపన చేయడం వల్లే తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేశారని, ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటైన ఆ పార్టీని దేశమంతా తిరసరిస్తున్నా బుద్ధి రావడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ అడ్డాగా మారిందని, బలిదానాలకు ఆ పార్టీయే కారణమని అన్నారు.
దీక్షా దివస్ సందర్భంగా కవిత చేసిన ట్వీట్కు అనుచిత వ్యాఖ్యానాలు చేసిన కాంగ్రెస్పై ఆమె ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యే. రాష్ట్ర సాధన కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్, దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టారు. యూపీఏ సర్కారు మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారు’ అని మంగళవారం ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ మహిళలను, బతుకమ్మను, బోనాలను కించపరచడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారులపై ‘తుపాకీ’ ఎకుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను పప్పన్నం, బోనం, బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడటం మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తున్నదని మండిపడ్డారు. సోనియాగాంధీ, ప్రియాంకగాంధీతో బతుకమ్మ ఎత్తించినా, బతుకమ్మ పేరు ఉచ్చరించేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతేనని తెలిపారు. మిలియన్ మార్చ్, సాగరహారం, అసెంబ్లీ ముట్టడిలో ఆడబిడ్డలు ముందున్నారని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి ఎక్కడున్నారంటూ నిలదీశారు.