MLC Kavitha | న్యూఢిల్లీ : బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్సీ కవిత ఈడీ( ED ) విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్( CM KCR ) నివాసం నుంచి కవిత తన భర్త అనిల్, సీనియర్ అడ్వకేట్ సోమా భరత్ కుమార్( Soma Bharat Kumar )తో కలిసి ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. కవితకు మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత వారందరికీ అభివాదం చేశారు.
ఈడీ విచారణ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కవిత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన సంగతి తెలిసిందే. కవిత ఈడీ విచారణకు హాజరు కావడం ఇది రెండోసారి. ఈ నెల 11న కవిత తొలిసారి ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మళ్లీ 16వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002లోని 50(2), 50(3) నిబంధనల మేరకు ఇచ్చిన నోటీసు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వికలాంగులు, మహిళలను ఇండ్ల వద్దే విచారించాలని, ఈడీ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నారు. తనను కార్యాలయానికి పిలిచి ఈడీ విచారించటం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. తన ఇంటి దగ్గర ఈడీ విచారణ చేయటమో, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ విధానంలో దర్యాప్తు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.
#WATCH | Delhi: BRS MLC K Kavitha arrives at the ED office after the agency summoned her in connection with the Delhi liquor policy case. pic.twitter.com/4ogIGyYPXJ
— ANI (@ANI) March 20, 2023