హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని ఏర్పాటు చేయాలని అంతర్జాతీయంగా పేరొందిన హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రె సిడెంట్ కృష్ణమోహన్ వీరవల్లి సోమవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. నిజామాబాద్ ఐటీ హబ్, రవాణా, నీరు, విద్యు త్తు వంటి సౌకర్యాలతోపాటు శాంతి భద్రతల గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవా ణా సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు నడిపించేందుకు కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మ న్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కవిత విజ్ఞప్తిపై కం పెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ను సందర్శించనున్నారు. ఎమ్మెల్సీ కవిత మా ట్లాడుతూ.. నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని ఏర్పాటు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. యువతకు స్థానికంగానే ఉద్యోగావకాలు కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొన్నారు.