హైదరాబాద్ : ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో తన వివరణ కోరడానికి ఈనెల 11న ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ మేరకు సీబీఐ అధికారులకు కవిత ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు.
ఈ కేసులో వివరణ కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సీబీఐకి కవిత లేఖ రాసిన విషయం విదితమే. కవిత లేఖకు సీబీఐ స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. 11వ తేదీన హైదరాబాద్లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ తెలిపింది.