పోడు భూముల పంపిణీతో సీఎం కేసీఆర్ గిరిజనుల జీవితాల్లో మార్పునకు నాంది పలికారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జల్-జంగిల్-జమీన్ నినాదానికి కేసీఆర్ సార్థకత తీసుకొచ్చారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోడు భూములకు పట్టాలు అందించి గిరిజనులను భూ యాజమానులుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని పేర్కొన్నారు. 1,51,146 మంది పోడు రైతులకు 4,06,369 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇంత స్థాయిలో పోడు భూములు పంపిణీ చేసిన మూడో రాష్ట్రం తెలంగాణయేనని స్పష్టం చేశారు.