హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. వైద్యులు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు ఆమె మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నా కాలికి గాయం అవ్వడంతో మూడు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉం టుంది’ అని ట్వీట్ చేశారు. మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి సహా పలువురు నేతలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.