శాయంపేట, మే 27: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఫోన్లో పరామర్శించారు. హరికృష్ణ తండ్రి సుదర్శన్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కవిత హరికృష్ణకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఆయుర్వేద వైద్యుడిగా సుదర్శన్.. 40 గ్రామాలకు అందించిన వైద్య సేవలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.
హరికృష్ణ, ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే తెలంగాణ సాంసృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం శాయంపేటలోని హరికృష్ణ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్ చిత్రపటానికి వారు పూలమాలవేసి నివాళులర్పించారు.