హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజల అవసరాలను సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలా అర్థం చేసుకొని తీర్చుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆపదలో ఎవరున్నా.. నేనున్నానంటూ ఆదుకొనే నాయకుడు మన కేసీఆర్ అంటూ.. ఆమె ట్వీట్ చేశారు. సోమవారం మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు, పౌరులను ప్రత్యేక విమానంలో క్షేమంగా స్వరాష్ట్రం తీసుకురావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ అల్లర్లలో చిక్కుకున్న ఓ జవాన్ కుటుంబాన్ని కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చారు.
తెలంగాణ పౌరులను క్షేమంగా తీసుకురావడం పట్ల సంబంధిత జవాన్ కుటుంబం వీడియో రూపంలో సీఎం కేసీఆర్కు, త్వరగా స్పందించిన ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ఆ వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్ర ప్రజలు ఎకడ ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా నేనున్నానంటూ కుటుంబ పెద్దలా ఆదుకొనే గొప్ప నాయకులు సీఎం శ్రీ కేసీఆర్ గారు. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లలో చికుకున్న జవాన్ కుటుంబాన్ని సురక్షితంగా స్వస్థలానికి చేర్చేందుకు ఏర్పాట్లు చేసి, వారి కుటుంబంలో సంతోషాన్ని నింపిన #DildaarCM మన #KCR గారు’ అంటూ ట్వీట్ చేశారు. విద్యార్థులను, పౌరులను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వ చొరవ ప్రశంసనీయమని నెటిజన్లు రీట్వీట్లు చేస్తున్నారు.