యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వామి వారి ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం మాట్లాడుతూ..ముచ్చటగా మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రావాలని స్వామివారిని కోరానని తెలిపారు.
స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని.. దీనికోసం అందరి సహకారం తీసుకుంటానని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండమైన ప్రగతి సాధించిందని ఎమ్మెల్యీ కడియం శ్రీహరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే అనుసరించే విధంగా రాష్ట్ర పథకాలు ఉన్నాయని ఆయన కొనియాడారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.