Bandi Sanjay | స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 26: రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించడానికే బీ జేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుంటే ప్రజలు అతడిని ఓ జోకర్లా చూస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో కేటీఆర్ సభ విజయవంతానికి సన్నాహక సమావే శం నిర్వహించారు.
ఎమ్మెల్యే రాజ య్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మా ట్లాడుతూ బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. బండి, కిషన్రెడ్డి తమ ప్రాంతాలకు ఏం చేశారో చె ప్పుకోవడానికి ఒక్కటీ లేదన్నారు. తెలంగాణ అభివృద్ధిని, విభజన చట్టం హామీలు నెరవేర్చేలా మోదీని ఒప్పించలేని చవటలు, దద్దమ్మలని మండిపడ్డా రు. అభివృద్ధి చేయడం చేతకాని బండి సంజయ్.. సీఎంను విమర్శించడానికే పాదయాత్రలు చేయడం శోచనీయమన్నారు. పాదయాత్రలతో ప్రజలకు ఒరిగేదేమీ లేకపోగా ప్రజాదరణను కోల్పోతున్నాడని ఎద్దేవా చేశారు. ఇతర రాజకీయ పార్టీలకు తెలంగాణపై ప్రేమ, అభిమానం, అభివృద్ధి చేయాలనే తప న ఉండదని అన్నారు. సీఎం కేసీఆర్కు తెలంగాణపై ప్రేమ, ప్రజల అవసరాలపై ఆలోచన, అభివృద్ధి పరచాలనే తపన ఉన్నదని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా బండి సంజయ్ హూందాగా ప్రవర్తించాల్సింది పోయి, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నాడని అన్నారు.