జగిత్యాల : పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం. మూసిన బడులు తెరిపిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) అన్నారు. జగిత్యాల(Jagithyala) జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం ఉపాధ్యాయులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి టీర్టీఎఫ్ క్యాలెండర్(TRTF calendar) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు నిధులు నియామకాల్లో వివక్షపై అవగాహన పెంపొందించి, తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారని తెలిపారు.
విద్య రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన సిబ్బంది, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ బాధ్యత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించారని, ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.