హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. కర్ణుడు బయటకు వెళ్లిపోయాడని చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డికి అసెంబ్లీతో బంధం తెగిపోయిందన్నారు. రాజీనామాతో నియోజకవర్గంలో టీఆర్ఎస్కి బలం పెంచుకునే అవకాశం ఇచ్చినట్లయిందని చెప్పారు.
రాజీనామాతో అభివృద్ధి అనేది సరైన వ్యూహం కాదని తెలిపారు. మూడేండ్లుగా రాజగోపాల్రెడ్డి చేసిన ఉద్యమేంటని జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పిందా అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడమంటే చేతకానితనమని విమర్శించారు. రాజగోపాల్రెడ్డి రాజీనామాను ప్రజలు ఎలా చూస్తారనేది చూడాలన్నారు. కాగా, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. అధికారంలోకి వచ్చినట్లేనని చెప్పారు. బరిలో నిలిచే అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.
అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో టీకాంగ్రెస్లో పంచపాండవులు మిగిలారని వెల్లడించారు. సీఎల్పీనేత భట్టివిక్రమార్క.. ధర్మరాజు అయితే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని భీముడని, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబును అర్జునుడిగా అభివర్ణించారు. రాజగోపాల్ రెడ్డిని కర్ణుడితో పోల్చారు.