పటాన్చెరు, జూన్ 3: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గీతం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం వర్సిటీలో గీతం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల దినోత్సవంలో తెలుగు సాహిత్యానికి గోరటి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ప్రదానం చేశారు.