హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్ర భుత్వాలు రూపొందించే బడ్జెట్లో స్వప్రయోజనా ల కోసం కాకుండా ప్రజ ల సమష్టి ప్రయోజనాలను కాపాడేలా కేటాయింపులు ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. బడ్జెట్ అంటే కేవలం అంకెలు, సంఖ్యలు మాత్ర మే కాదు, నైతిక ప్రమాణాలు కూడా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ యూపీ, మహారాష్ట్ర తర్వాత అతి పెద్ద బడ్జెట్. కానీ, గత రెండేండ్లు కేటాయించిన బడ్జెట్లో ప్రతి ఏటా 60 శాతానికి మించి నిధులు ఖర్చు చేయలేదని చెప్పా రు. ఆరు గ్యారెంటీల అమలుపై బడ్జెట్లో కేటాయింపులు లేవని అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేదని, గత ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లు, పరీక్షలకు నియామక పత్రాలు మాత్రమే ఇస్తే ఉద్యోగాల భర్తీ పూర్తయిన ట్టు కాదని పేర్కొన్నారు. చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ను ఎందుకు అమ లు చేయడం లేదని ప్ర శ్నించారు. పాలమూరు, ఉస్మానియా యూనివర్సిటీలో రెండేండ్లుగా మెస్ బిల్లు లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మూసీని శుద్ధి చేయడానికి తాను వ్యతిరేకం కాదని, కేసీఆర్ ఉన్నప్పుడే మురుగునీటి శుద్ధి కేంద్రాలు తెచ్చారని చెప్పారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చవద్దని, ప్రజలను బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయించాల్సిన అవసరం లేకుండా మూసీ శుద్ధి చేపట్టాలని సూచించారు.