హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణను సీఎం రేవంత్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని, గత 10 నెలల్లో ఆయన సర్కార్ అడ్డగోలుగా తెచ్చిన అప్పులు వార్షిక రుణ సమీకరణ లక్ష్యాన్ని దాటి 128 శాతానికి చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు మార్ ధ్వజమెత్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్ల రుణా లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రకటించిన రేవంత్ సర్కార్.. గత నెల చివరి నాటికే రూ.69,148 కోట్ల అప్పులు తెచ్చిందని, కాగ్ తాజా నివేదికతో కాంగ్రెస్ సర్కార్ అసలు రంగు బయటపడిందని తెలిపా రు. ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.22,782 కోట్ల గ్రాంట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేసిన ప్రభుత్వం.. ఇప్పటివరకు కేవలం రూ.4,213 కోట్లు (18%) మాత్రమే తెచ్చుకోగలిగిందని ఆదివారం ప్రకటనలో విమర్శించారు.
నిరుడు కాంగ్రెస్ సర్కార్ ప్రైవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధాల పుట్ట అని దాసోజు నిప్పులు చెరిగారు. ఆ బడ్జెట్లో రూ.2,29,720 కోట్ల ఆదాయం వస్తుందని గొప్పలు చెప్పిన ప్రభుత్వానికి ఇప్పటివరకు కేవలం రూ.1,38,371 కోట్లు (60%) మాత్రమే వచ్చిందని ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలల ముందే బడ్జెట్లో 40% లోటు ఉండటం సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని తూర్పారబట్టారు. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతున్న సీఎం రేవంత్ మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఎక్కడా పొంతనే లేదని ధ్వజమెత్తారు. కనీసం మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా సరిగా అంచనా వేయలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని ఎద్దేవా చేశారు.
సీఎం పదే పదే ఢిల్లీకి వెళ్లేది రాష్ట్ర ప్రయోజనాల కోసమా? లేక ఫొటో షూ ట్ల కోసమా? అని ప్రశ్నించారు. బడే భాయ్ అంటూ మోదీ చుట్టూ తిరుగుతున్న రేవంత్ కేంద్రం నుంచి నయాపైసా కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలు ఎందుకు తప్పాయో చెప్పాలని, ఆదాయం ఎందుకు త గ్గిందో శ్వేతపత్రం విడుదల చేయాల ని, పరిమితికి మించి చేసిన అప్పులపై బహిరంగ వివరణ ఇవ్వాలని దాసోజు సర్కార్ను డిమాండ్ చేశా రు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్సిటీ, రైతుబంధు, 6 గ్యారంటీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టం చేయాలని, జీఎస్టీ, ఎక్సైజ్ రాబడులను పెం చేందుకు ప్రణాళిక ఏమిటో చెప్పాలని కోరారు.