మెదక్ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం హవేళిఘనపూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా కసిరెడ్డి మాణిక్యరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పరుశురామ్, జడ్పీటీసీ సుజాత, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ