హైదరాబాద్ : జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే విద్యాసాగర్ హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో గురువారం మర్యాపూర్వకంగా కలిశారు.
తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సీఎం కేసీఆర్, సహకరించిన ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమ కారులకే కేసీఆర్ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు.