హైదరాబాద్ : దౌర్భాగ్యపు ఎంపీ అర్వింద్ అనీ, మహిళలను గౌరవించే సంస్కారం ఆయనకు లేదంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మండిపడ్డారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కవిత సారథ్యంలో అనేక ప్రయత్నాలు చేసినట్లు గుర్తు చేశారు. అర్వింద్ ఎవరిని తిట్టినా అది తమకే ప్లస్ అవుతుందన్నారు.
ఇకనైనా ఎంపీ చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ చచ్చిన పాము అనీ.. బీజేపీని ఎదుర్కోలేని దద్దమ్మ రాహుల్ అని విమర్శించారు. రాహుల్ వల్లే కాంగ్రెస్ పతనం అవుతోందని, సొంత పార్టీ నేతలే మాట్లాడుతున్నారన్నారు. విభజన హామీలపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడుతుంటే రాహుల్ ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు.