హైదరాబాద్ : ప్రజలకు ఉపయోగపడే పనులకు మా సహకారం ఎళ్లవేలలా ఉంటుందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. ఆదివారం అమీర్పేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ(Arogya Shri )సేవలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలకు అతీతంగా ప్రజలకు మేలు కార్యక్రమాలకు మా సహకారం ఉంటుందని స్పస్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నప్పుడే ప్రజల్లో ప్రభుత్వాలపై విశ్వాసం ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.