యాదాద్రి భువనగిరి : తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటే గానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేయలేదు. కేసీఆర్ పోరాటం, అమరుల బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునితామహేందర్ రెడ్డి(MLA Sunithamahender Reddy) అన్నారు. శుక్రవారం సైదాపురం నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో ఎవరికి ఏం అవసరం, ఏ కులానికి ఏం కావాలో కేసీఆర్ఖు తెలుసు కాబట్టే అందుకనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
సాగు వసతులు కల్పించడంతో ఆలేరు నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు పంటసాగు విస్తరించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పాడంటే చేసి తీరుతడు. చెప్పిన హామీలే కాకుండా చెప్పని కూడా ఎన్నో అమలు చేశారన్నారు. లాక్ డౌన్లో ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి ప్రజలను ఆదుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రూ.400 కే వంట గ్యాస్, ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తం. మ్యానిఫెస్టోలోని హామీలన్నింటిని నెరవేరుస్తాం. సైదాపురం ఆడబిడ్డగా భావించి మరోసారి నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.