హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన దామెర రాకేశ్ మృతిచెందాడు. దీంతో రాకేశ్ మృతిని నిరసిస్తూ నేడు నర్సంపేట నియోజకవర్గ బంద్కు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.
రాకేశ్ మృతదేహంతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు వరంగల్ నుంచి ర్యాలీగా నర్సంపేటకు ఆయన మృతదేహాన్ని తీసుకెళ్తారు. అనంతరం దబీర్పేటలో రాకేశ్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.